ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ మాటల మర్మం అదేనా?
తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకుంటున్న తమిళిసై ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారులను,ఇటు మంత్రిని ఆర్టీసీ సమ్మె గురించి ఆరా తీస్తూ వేగం పెంచారు.
బతుకమ్మ గొప్పదనం అదే: ఆయుధ పూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై
ఆర్టీసీ కార్మికులకు మేలు
ఆర్టీసీ సమ్మెలో గవర్నర్ జోక్యం చేసుకోవడం వల్ల ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుంది అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటారనే విషయం ఆసక్తిగా మారింది.
జేఏసీ కన్వీనర్ వ్యాఖ్యలు
జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ సమ్మె విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సీఎం కేసీఆర్ డైలమా
మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ సైతం, టిఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేయడానికి ఆర్టీసీ సమ్మెను , ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంకోచంలో పడ్డారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్
సమ్మె కొనసాగితే ప్రభుత్వ మనుగడకు విఘాతం కలిగిస్తుంది. ఒకవేళ చర్చలకు వెళితే ఆర్టీసీ కార్మికుల ముందు ప్రభుత్వం మెట్టు దిగినట్టు అవుతుంది. ఇక ఇదే తరహా ఉద్యమాలు ప్రతి శాఖలో కొనసాగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకొని సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.