"రేవంత్ అలా అనడం హాస్యాస్పదమే.. యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు!"
రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అనడం హస్యాస్పదం అన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ పరిధిలో ఉన్న గౌడవెల్లిలో ఆదివారం నాడు రెడ్డి మహాగర్జన సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ పార్టీలు, సంస్థలు, సంఘాలకు చెందిన అనేకమంది రెడ్డి సామాజికవర్గం నేతలంతా ఒక్క తాటి పైకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తాను సీఎం అయితే రెడ్డి కార్పోరేషన్, రెడ్డి డిమాండ్లపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అనడం హస్యాస్పదం అన్నారు.

యువతను రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని గుత్తా హితవు పలికారు. రెడ్డి సామాజికవర్గంలో 80శాతం మంది ఆర్థికంగా ఉన్నవారేనని తెలిపారు. అవసరమైతే సంక్షేమ నిధి ఏర్పాటు చేసి రెడ్డి సామాజిక వర్గంలోని పేదలను ఆదుకుంటామని తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
-
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications