సినిమా స్ట్రైల్లో సైకో శ్రీనివాస రెడ్డి... మృతుల పేర్లు చెట్లపైకి చెక్కి...
యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామం సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు సినిమాలను తలపించేలాగా ఉన్నాయి. హత్యలకు ముందు అమ్మాయిని వేధించాడని గ్రామస్థులు కలిసి కొడితే,ఏకంగా గ్రామంలోని అమ్మాయిల మీద కక్షపెంచుకుని ఏకంగా ముగ్గురు అమ్మాయిలను అనతికాలంలోనే మట్టుబెట్టాడు.కాగా ఈ హత్యల కోసం అచ్చు సినిమా స్టైల్స్ లోని అమ్మాయిల పేర్లను కూడ చెట్లకు రాసుకున్నాడు డబుల్ సైకో శ్రీనివాస్ రెడ్డి
సైకో శ్రీనివాస రెడ్డి లీలలు ఓక్కోటి బయటకు
యాదాద్రీ జిల్లా బోమ్మల రామారం మండలం హీజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు మైనర్ అమ్మాయిలపై అత్యాచార చేసి అంత్యంత కిరాతంగా చంపిన శ్రీనివాస రెడ్డి చేసిన ఆకృత్యాలు ఒక్కోక్కటీ ప్రజలకు తెలుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. స్వంత గ్రామంలోనే అమ్మాయిలను హత్య చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్టు తెలుస్తోంది.
హత్య చేసిన అమ్మాయిల పేర్లు చెట్లపై..చెక్కిన కిల్లర్
ఈనేపథ్యంలనే మైనర్ బాలికలపై అత్యాచారం జరిపి హత్య చేసి తన పోలంలోని బావిలో పాతిపెట్టిన శ్రీనివాసరెడ్డి, అంతకు ముందు పోలం వద్ద ఉన్న రావి, మేడీ వేప చెట్లకు పూజలు చేసేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే పూజలు చేయడంతో పాటు శ్రీనివాస్ రెడ్డి హత్య చేసిన మనిషా అనే అమ్మాయి పేరును కూడ మేడి చెట్టుకు చెక్కినట్టు గ్రామస్థులు గుర్తించారు. దీంతో చెట్టుపై మృతురాలు మనిషా పేరు ఉండడం గ్రామస్థుల్లో భయాందోళనలకు గురి చేస్తుంది. అయితే ఆ చెట్లకు శ్రీనివాస రెడ్డి గతంలో పూజలు చేస్తుండే వాడని గ్రామస్థులు తెలిపారు. దీంతో ఇలా హత్యలు చేసేందుకు శ్రీనివాస రెడ్డి వ్యక్తిగతంగా కక్షను పెంచుకునే వారిని టార్గెట్ చేసి చంపినట్టు గ్రామస్థులు భావిస్తున్నారు.
ఉరితీయాలంటూన్న గ్రామస్థులు
ఇక ఇన్ని పన్నాగాలు పన్ని ముగ్గురిని బలితీసుకున్న శ్రీనివాస రెడ్డిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు శనివారం ఫిర్యాదు చేశారు. ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి త్వరగా శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు కూడ ప్రత్యేక కేసులు పెట్టేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు.కాగా శ్రీనివాస రెడ్డికి కస్టడీలోకి తీసుకున్న సిట్ పోలీసులు ఆరు రోజుల పాటు పలు కోణాల్లో విచారణ జరిపారు. అయినా పోలీస్ కస్టడీలో ఉన్నన్ని రోజులు నోరు విప్పలేదని సమాచారం. దీంతో పోలీసులు మొత్తం నలుగురి హత్య కేసులో నిందితుడిగానే చేర్చారు.