వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరూ హోమో సెక్సువల్: చివరకు అదే హత్యకు కారణమైంది!

|
Google Oneindia TeluguNews

నల్గొండ: హోమో సెక్సువల్ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతుడి భార్య మాత్రం కేసును పోలీసులు తప్పుదోవ పట్టించారని, హత్య వెనుక అసలు కారణం అది కాదని ఆరోపిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎనుగులదోరికి చెందిన పాటి జాన్‌రెడ్డి(25), కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రగూడెంకు చెందిన మాదాసు ఆరోగ్యం నార్కట్‌పల్లి శివారులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీలో ఏర్పడిన పరిచయం.. వీరిద్దరి మధ్య అసహజ లైంగిక సంబంధానికి దారితీసింది.

homosexual relationship leads to murder in narketpally

ఇదే క్రమంలో ఇటీవల మాదాసు ఆరోగ్యం చిన్న కూతురు మరణించింది. కూతురి మృతితో ఆరోగ్యం ఆవేదనతో కుమిలిపోతున్నాడు. అదే సమయంలో జాన్ రెడ్డి నుంచి లైంగిక వేధింపులు అయ్యాయి. డబ్బులు డిమాండ్ చేయడం.. ఇవ్వని పక్షంలో ఇద్దరి మధ్య సంబంధాన్ని బయటపెడుతానని జాన్ రెడ్డి బెదిరించడం ఆరోగ్యానికి విసుగు తెప్పించింది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీని జాన్ రెడ్డిని హత్య చేశాడు ఆరోగ్యం. ఇద్దరు కలిసి నార్కట్ పల్లి శివారులోని ఎనుగులదోరి వ్యవసాయ బావి వద్ద మద్యం సేవించిన తర్వాత.. ఆరోగ్యం జాన్ రెడ్డిని చంపేశాడు. జాన్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసి పోలీసులు దీన్ని బయటపెట్టారు. అయితే జాన్ రెడ్డి భార్య మాత్రం హత్య వెనుక వట్టిమర్తికి చెందిన ఓ మహిళ ఉందని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించడం గమనార్హం.

English summary
Police chased the murder mystery behind Johnreddy's death on May 6th, in Narketpalli. They found homosexual relationship with Arogyam who is his colleague was the main reason behind this murder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X