వడదెబ్బతో చనిపోతే భారీ సాయం! డబ్బులు రావాలంటే ఇవి ఉండాల్సిందే!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నిప్పుల కొలిమిని తలపించే ఎండలతో సామాన్యులు విలవిలలాడిపోతుంటారు. ముఖ్యంగా వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయే దురదృష్టకర సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. గతంలో ఇలాంటి మరణాలకు ప్రభుత్వం కేవలం రూ.50,000 మాత్రమే పరిహారంగా అందించేది. అయితే, పెరిగిన ఖర్చులు, బాధిత కుటుంబాల దీన స్థితిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (SDMA), గతేడాది ఈ మొత్తాన్ని ఏకంగా రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిధులు ఆయా కుటుంబాలకు కొండంత అండగా నిలవనున్నాయి.
పరిహారం పెంచినప్పటికీ, అది నిజమైన బాధితులకు అందేలా ప్రభుత్వం పక్కా నిబంధనలను రూపొందించింది. ఒక వ్యక్తి వడదెబ్బతోనే మరణించారని నిర్ధారించడానికి మండల స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది. ఇందులో రెవెన్యూ (తహసీల్దార్), ఆరోగ్య (వైద్యాధికారి), పోలీసు శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరి ముగ్గురి విచారణలో ఆ మరణం ఎండ తీవ్రత వల్లే జరిగిందని తేలితేనే ప్రభుత్వం పరిహారాన్ని మంజూరు చేస్తుంది.

తప్పనిసరిగా చేయాల్సిన పనులు
వడదెబ్బ మరణాలకు సంబంధించి ప్రభుత్వ సాయం పొందాలంటే కొన్ని చట్టపరమైన ఆధారాలు అత్యవసరం. కేవలం ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం నగదు విడుదల చేయదు. కాబట్టి ఎవరైనా వడదెబ్బతో మరణించినట్లయితే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి..
- పోస్ట్మార్టం (Post-mortem): మరణానికి కారణం వడదెబ్బ అని శాస్త్రీయంగా నిరూపించడానికి పోస్ట్మార్టం నివేదిక తప్పనిసరి.
- డాక్యుమెంటేషన్: డెత్ సర్టిఫికేట్తో పాటు, పోలీసులు నిర్వహించే పంచనామా రిపోర్టును దరఖాస్తుకు జత చేయాలి.
- దరఖాస్తు ప్రక్రియ: ఈ పత్రాలన్నింటినీ సిద్ధం చేసుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.4 లక్షల ఆర్థిక సాయం, కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడే కుటుంబాలకు కనీస భరోసానిస్తుంది. అయితే, ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు కాబట్టి, ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
-
కరెంట్ అప్పు తీసుకుంటున్నారు! హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
నాగ చైతన్య - రష్మిక కు అవార్డులు, దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి -
అక్కడ మంచు కరిగితే.. ఇక్కడ వర్షాలు ఎందుకు పెరుగుతున్నాయి? -
విద్యార్థులకు షాక్: భారీగా పెరిగిన ఫీజులు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!














Click it and Unblock the Notifications