ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.1.03 కోట్లు నగదు, అంత డబ్బు ఎవరిది? ఎక్కడికెళుతోంది?
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.1.03 కోట్లు పట్టుబడ్డాయి. పూజిత హోటల్ ముందు పార్కింగ్ చేసి ఉన్న బస్సులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఈ భారీ మొత్తాన్ని పట్టుకున్నారు.
ఈ నగదు ఓ జ్యువెలరీ షాప్ యజమానికి చెందినదిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఓ వ్యాపారికి చెందిన రూ.17 లక్షలు చోరీ జరిగిందని ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఆ నగదు కోసం బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీ మొత్తంలో డబ్బు వెలుగుచూసింది. అయితే పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నగదును తీసుకెళ్లుతున్ వ్యక్తితోపాటు, రూ.17 లక్షల చోరీ జరిగిందని చెబుతున్న వ్యాపారిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications