కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగిన మైకంలో చీరెపై గొడవ: భార్యను చంపేసిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: అతి చిన్న విషయంపై గొడవ జరిగి హత్యకు దారి తీసింది. పెళ్లి జరిగి ఏడాది కూడా గడవకముందే ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ఈ సంఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మంథనిలో మంగళవారంనాడు చోటు చేసుకుంది.

కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కొండ పద్మ, రాజయ్యల పెద్ద కూతురు శిరీష (22)ను మంథనికి చెందిన మేర్గు రాజమల్లు కుమారుడు చంద్రమోహన్‌కు ఇచ్చి నిరుడు జూన్ 20వ తేదీన వివాహం జరిపించారు. వివాహం సమయంలో 3 లక్షల 70 వేల రూపాయలు కట్నంగా ముట్టజెప్పారు.

Husband kills wife in Karimnagar district

భార్యాభర్తలు కొంత కాలం అన్యోన్యంగానే ఉన్నారు. వారం రోజుల్లో పెళ్లి రోజు ఉండడంతో చీరె విషయంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తాగిన మైకంలో చంద్రమోహన్ భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవలో ఓ చేత్తో ముక్కు నోరు మూసి మరో చేత్తో గొంతు నులిమి చంద్రమోహన్ తన భార్య శిరీషను హత్య చేశాడు.

కొద్దిరోజులుగా తమ కూతురును ఆమె భర్త, అతని తల్లిదండ్రులు, మేనత్త రూ. 3 లక్షల అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని, ఈ విషయంపై మూడు నెలల క్రితం పంచాయతీ కూడా జరిగిందని మృతురాలి తల్లిదండ్రులు పద్మ, రాజయ్యలు చెప్పారు కావాలనే పథకం ప్రకారం తమ కూతురిని హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు.

English summary
A man Chandramohan killed his wife Sirisha at Manthani in Karimnagar district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X