సిటీ ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్: నరగంలోని ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఆదివారం(ఫిబ్రవరి 4) నుంచి హైదరాబాద్ నగరంలో 11వ తేదీ వరకు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతోపాటు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి నుంచి అంటే ఆదివారం నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు మొత్తం 51 రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఫిబ్రవరి 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్-సిర్పూర్ కాగచ్ నగర్, వికారాబాద్-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్-ఎక్స్ప్రెస్ను షెడ్యూల్ ప్రకారం నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.
-
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications