వైట్కాలర్ నేరాలతో రూ.3 కోట్లు దోపిడి: రియల్టర్ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్
వైట్కాలర్ నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్న రియల్టర్ అరుణారెడ్డిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు.అరుణారెడ్డిపై ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయన్నారు భగవత్.
హైదరాబాద్: వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం నాడు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.తెలంగాణలో మొదటిసారి వైట్ కాలర్ నేరస్తురాలిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు.

అరుణ అనే మహిళపై ఇదివరకే 10 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 2009 నుంచి 19 మందిని మోసం రూ.3.23 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించారు.
ఆమెపై కేసు నమోదు చేసి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. 2005లో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి పీఎస్యూ బ్యాంక్ను మోసం చేసిన కేసులో సీబీఐ కూడా గతంలో అరుణారెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. పీడీ యాక్ట్ అనేది పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేస్తామని మహేశ్ భగవత్ తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications