వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైట్‌కాలర్ నేరాలతో రూ.3 కోట్లు దోపిడి: రియల్టర్ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్

వైట్‌కాలర్ నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్న రియల్టర్ అరుణారెడ్డిపై పిడి యాక్ట్‌ నమోదు చేసినట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు.అరుణారెడ్డిపై ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయన్నారు భగవత్.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైట్‌ కాలర్‌ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్‌ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ గురువారం నాడు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.తెలంగాణలో మొదటిసారి వైట్‌ కాలర్‌ నేరస్తురాలిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు తెలిపారు.

Hyderabad: 47-year-old woman who cheated people of Rs 3 crore, detained

అరుణ అనే మహిళపై ఇదివరకే 10 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 2009 నుంచి 19 మందిని మోసం రూ.3.23 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించారు.

ఆమెపై కేసు నమోదు చేసి చంచల్‌ గూడ మహిళా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. 2005లో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి పీఎస్‌యూ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో సీబీఐ కూడా గతంలో అరుణారెడ్డిని అరెస్ట్‌ చేసిందన్నారు. పీడీ యాక్ట్‌ అనేది పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేస్తామని మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

English summary
A 47-year-old woman, who allegedly cheated people in Hyderabad to the tune of over Rs 3 crore, has been detained under the stringent Preventive Detention (PD) Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X