merchant: స్నేహితులని రూ. 40 లక్షల అప్పు ఇస్తే..: కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన స్నేహితులు దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగివ్వమన్నందుకే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

అప్పుగా ఇచ్చిన రూ. 40 లక్షలు ఇవ్వమంటే హత్యకు కుట్ర
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని కర్మన్ఘాట్కు చెందిన మధుసూదన్ రెడ్డి చార్మినార్లో వ్యాపారం చేస్తుంటారు. అతడి స్నేహితులు సంజు, గిరీశ్, గాడ్జే తరచూ అక్కడికి వస్తుండేవారు. మధుసూదన్ వద్ద ఈ ముగ్గురు రూ. 40 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మధుసూదన్ అడిగాడు. దీంతో అతడ్ని హతమార్చేందుకు కుట్రపన్నారు.

కిడ్నాప్ డ్రామా ఆడేందుకు ప్లాన్..
ఆగస్టు 19న మధుసూదన్ రెడ్డిని జగన్నాథ్ అనే కారు డ్రైవర్తో కలిసి ఈ ముగ్గురూ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సంగారెడ్డి సమీపంలోని ఓ దాబా వద్ద ఆగి జగన్నాథ్తో పాటు అతని కారును వదిలేసి వేరే కారులో మధుసూదన్ రెడ్డిని తీసుకెళ్లారు. హత్య చేసిన అనంతరం ఈ విషయాన్ని జగన్నాత్కు చెప్పి కిడ్నాప్ డ్రామాగా చెప్పాలని ఒప్పించారు. మధుసూదన్ అదృశ్యమైన నేపథ్యంలో అతని కుటుంబసభ్యులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టారు.

వ్యాపారిని హత్య చేసి ముంబైకి పరారైన నిందితులు
ఈ క్రమంలో కారు నెంబర్ ఆధారంగా జగన్నాథ్ను గుర్తించి విచారించగా హత్య విషయం బయటికి వచ్చింది. పొలంలో పూడ్చిపెట్టిన మధుసూదన్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. నిందితులు మధుసూదన్ను హతమార్చిన అనంతరం ముంబై హైవేవైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Recommended Video

వనస్థలిపురంలోని లాడ్జీలో ఏపీ వ్యక్తి ఆత్మహత్య
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురంలో ఓ లాడ్జీలో ఏపీకి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన లారీ యజమాని షేక్ బ్రహ్మం(36). ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు. శనివారం అతని స్నేహితుడు వేణుగోపాల్ తో కలిసి వనస్థలిపురం ఆటోసాయినగర్లోని వీఎంఆర్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు. తిరిగి సాయంత్రం బార్కి వచ్చి మళ్లీ మద్యం సేవించారు. ఆ తర్వాత షేక్ బ్రహ్మం తన గదిలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తాను చనిపోతున్నానని, ప్రేమించి మోసపోయానని, స్నేహితులు కూడా మోసం చేశారని చెబుతూ ఫ్యాన్కు లుంగీతో ఉరేసున్నాడు. ఫేస్బుక్ లైవ్ ఈ విషయం చెప్పాడు. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు.
వేణుగోపాల్ కూడా పలుమార్లు ఫోన్ చేశాడు. అయినా తీయకపోవడంతో బ్రహ్మం ఉన్న గదికి హుటాహుటిగా వెళ్లాడు. గది తలుపులు వేసి ఉండటంతో కిటికీలోంచి చూసేసరికి ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. లాడ్జీ సిబ్బందిని పిలిచి గది తలుపులు తెరిపించాడు. అప్పటికే షేక్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications