ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా బోల్తా పడిన కారు: సిటీ కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

హైదరాబాద్: నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కాంగ్రెస్ నేత కుమార్తె మృతి చెందింది. వేగంగా వస్తున్న వాహనం అదుపుతప్పడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా(25) మృతి చెందింది. మరో ఇద్దరికి గాయలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Hyderabad: Congress leaders daughter killed in a accident

తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తానియా బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు.ప్రమాద ఘటనపై ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+