హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabadలో ఒక్కరోజే 4 హత్యలు, నడిరోడ్డుపై కత్తులో పొడుచుకున్న రౌడీషీటర్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో జరిగిన వరుస హత్యలు కలకలం సృష్టించాయి. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాహుల్ అనే వ్యక్తిని అతడి స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మరో ఘటనలో ఓ యువకుడ్ని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన రెయిన్ బజార్‌లో చోటు చేసుకుంది.

ఇది ఇలావుండగా, మెహదీపట్నం లంగర్‌హౌస్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు పరస్పరం దాడులు చేసుకుని హతమయ్యారు. శుక్రవారం రాత్రి ఆలివ్ ఆస్పత్రి సమీపంలో చాంద్ మహ్మద్(షేక్ మహ్మద్), అబూ(ఫైజుద్దీన్) అనే ఇద్దరు రౌడీ షీటర్లు నడిరోడ్డుపై కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

 Hyderabad: four murders in single day; two rowdy sheeters killed each other

ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన చాంద్, అబూలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

Jr NTR Fans Vs Meera Chopra : KTR Responds On Meera Chopra Complaint Against Jr NTR Fans

పాత కక్షలతోనే ఇద్దరు ఘర్షణకు దిగి చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ కమిషనర్(వెస్ట్) ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఓ గ్రూపు బైక్స్ పై వెళుతుండగా మరో గ్రూపు ఎస్ యూవీ వాహనంలో వెళుతూ వారిని ఢీకొట్టడంతో ఘర్షణ మొదలైందని తెలిసిందని చెప్పారు.

English summary
In a suspected gang rivalry, two people were brutally murdered on the main road at Langar Houz here on Friday night. The victims were identified as Shaik Mohammed from Golconda and Faizuddin from Mehdipatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X