ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో రైలు!
హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు గురువారం తీవ్ర అంతరాయం నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 20 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రైలు సేవల్లో అంతరాయం కలిగింది.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో.. భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఆ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్లో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎంతసేపటికీ కదలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నుంచి బయటికి వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు బయల్దేరారు. సాంకేతిక కారణాలతోనే రైలు సేవలకు అంతరాయం కలిగిందని మెట్రో యాజమాన్యం వెల్లడించింది. టెక్నికల్ ఇష్యూను సరి చేయడానికి తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపింది. కాగా, మే 1వ తేదీన ప్రభుత్వ సెలవు దినం కావడంతోరైళ్లలో రద్దీ కాస్త తక్కువగా ఉంది.
🚨 Hyderabad Metro Glitch!
— Uday Kumar (@Meet_4_Uday) May 1, 2025
Trains on Ameerpet–Miyapur route stopped for 20 mins due to a tech fault near Bharatnagar.
Peak hour chaos left passengers angry and delayed! ⏱️💢#Hyderabadmetro #Metro #Hyderabad #publictransport pic.twitter.com/1AmoW8fHw9
ఏప్రిల్ 2న కూడా మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్య కారణంగా నాంపల్లిలో దాదాపు పావుగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత స్పందించిన మెట్రో సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించడంతో రైలు సేవలు యథావిధిగా కొనసాగాయి.
మరోవైపు, హైదరాబాద్ మెట్రో యాజమాన్యం రైలు ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో టికెట్ ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని మెట్రో స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రయాణికులకు ఇస్తున్న పలు రాయితీలను తొలగించిన విషయం తెలిసిందే. ఇక, త్వరలోనే మెట్రో ఛార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications