సోమాలియాలో నరకం చూస్తున్న నా సోదరిని కాపాడండి: సుష్మాకు హైదరాబాదీ వేడుకోలు
హైదరాబాద్: సోమాలియాలో నరకం అనుభవిస్తోన్న తన సోదరిని కాపాడాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను వేడుకున్నారు. తన సోదరి మొహమ్మదీ బేగమ్కు, ఆమె పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టకుండా అత్తింటివారు వేధిస్తున్నారని సోదరుడు మొహమ్మద్ వహియుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'నా సోదరికి 2003లో సోమాలియా జాతీయుడైన సయ్యద్ హసన్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వారు అప్పటి నుంచి 2013 వరకు హైదరాబాద్లో మాతో పాటే ఉండేవారు. వారికి ఐదుగురు పిల్లలు జన్మించారు. 2013లో సోమాలియాలో ఉన్న తన తల్లిదండ్రులు పిల్లలను చూడాలంటున్నారని సయ్యద్ చెప్పడంతో నా సోదరి, పిల్లలతో సహా అక్కడికి వెళ్లింది. సయ్యద్ మాత్రం ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి, ఆ తరవాత అమెరికా వెళ్లిపోయాడు. నా సోదరి,ఆమె పిల్లలు సోమాలియాలోనే ఉండిపోయారు' అని వహియుద్దీన్ తెలిపారు.

ఆ తర్వాత 'సయ్యద్ కుటుంబ సభ్యులు నా సోదరికి, ఆమె పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారు' అని వహియుద్దీన్ మీడియా ఎదుట వాపోయాడు. వెంటనే వారిని కాపాడాలని విదేశాంగమంత్రిని అభ్యర్థించాడు. ఎటువంటి ఆలస్యం చేయకుండా తన సోదరిని, ఆమె పిల్లలను భారత్ తీసుకురావాలని వేడుకున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications