ఐ యామ్ ద ట్రెండ్ సెట్టర్, నాట్ ఫాలోవర్ : సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదీ చేసిన సెన్సేషనే అవుతోంది, ఆయన ఆలోచనలు అన్ని ఢిపరెంట్ గా ఉంటాయి, పాత పద్దతులకు చెల్లుచీటీ ఇచ్చి వాటి స్థానంలో కోత్త వాటిని ప్రవేశ పెడతారు, ఇలా చెప్పుకుంటు పోతే ఆయన రాజకీయాల్లో ట్రెండ్ ఫాలోవర్ కాకుండా ట్రెండ్ సెట్టర్ గా పరిపాలన కొనసాగిస్తారనడంలో సందేహం లేదు.ఈనేపథ్యంలోనే ఆయన ఖమ్మం ఎన్నికల సభలో ఏకంగా కలెక్టర్ అనే పేరునే తోలగించే వైపుగా సీఎం ఆలోచిస్తున్నట్టు ప్రకటించారు.
కలెక్టర్ల అనే పేరు ను మారుస్తాం, సీఎం కేసీఆర్
రాజకీయ నాయకులు అంటే ట్రెండ్ ఫాలోవర్స్ కాదు అప్పుడప్పుడు ట్రెంట్ సెట్ చేస్తారు కూడా, పాత పథకాల పేర్లు మార్చి ,వాటి స్థానంలో కోత్త పేర్లు పెడతారు, అది నచ్చకపోతే ఉన్న వాటిని ఊడదీస్తారు ,ఎందుకంటే పవర్ వాళ్ల చేతుల్లో ఉంటుంది ,చట్టాలు వారే చేస్తారు, ఈనేపథ్యంలోనే పాత సంప్రాదాయాలు కోనసాగించడమే కాదు , కోత్తవాటికి రూపం పోస్తారు కూడా ,ఇందులో సిఎం కేసీఆర్ ఆద్యుడు అని చెప్పవచ్చు, గతంలో ఎన్నో రాజకీయా నిర్ణయాలు చేసిన సీఎం దృష్టి పరిపాలన వ్యవస్థపై పడింది. దీంతో బ్రిటీష్ కాలం నాటీ రెవెన్యు వ్యవస్థ మనం ఇంకా కొనసాగించాలా అనే కోణం ఉన్నారు. బ్రిటిష్ కాలంలో ఉన్న కలెక్టర్ వ్యవస్థ అప్పటి పరిపాలన కు అనుగుణంగా పెట్టిన పేరుగా అభివర్ణించారు. బ్రిటిష్ రూలింగ్ మొత్తం రెవెన్యు వ్యవస్థ అంతా కలెక్టర్ల చేతిలో ఉండేది, ఏ పన్నులు వేయాలన్న ,రెవెన్యు వసూళ్లు చేయాలన్న వాళ్లే కీలక పాత్ర పోషించేవారు. అందుకే వారిని కలెక్టర్ అనే పేరుతో పిలుస్తారు, అయితే ఆ సాంప్రదాయం ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడ కొనసాగుతోంది.
అప్పట్లో డబ్బులు కలెక్ట్ చేసేవారు కాబట్టి కలెక్టర్లయ్యారు,
అయితే అప్పట్లో ఖాజాన నింపేందుకు అప్పటి కలెక్టర్లు ఉపయోగపడేవారనేది సీఎం కేసీఆర్ అభిప్రాయం , దీంతో పరిపాలన కొనసాగించేవారు, అయితే ఇప్పడు ఉద్యోగులకు జీతాల నుండి అభివృద్దికి సంబంధించిన ప్రతి పైసా ప్రభుత్వం నుండే నేరుగా ఆయా జిల్లాలకు వెళుతోంది.దీంతో వారికి డబ్బులు కలెక్ట్ చేయాడానికి అవకాశం ఎక్కడిది అని ప్రశ్నించారు కేసీఆర్ , అన్ని ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు వారు కలెక్టర్లు ఎలా అవుతారని అంటున్నారు. దీంతో వారిని జిల్లా పరిపాలన అధికారులాగానో మరో పేరుతోనే పిలిచేందుకు సిద్దమవుతున్నాట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్
టిఆర్ఎస్ నుండి గవర్నర్ లు, విదేశీ రాయబారులు :సీఎం కేసీఆర్
ఖమ్మం సభలోనే సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో ఎప్పుడు ఎక్కడ చెప్పలదంటూనే , టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మేల్యేలు, ఎంపీలు ,మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడ అవుతారని వీటితో పాటు గవర్నర్లు ,విదేశీ రాయబారులు సైతం అవుతారని తాను గతంలోనే పార్టీ శ్రేణులకు చెప్పానని గుర్తు చేశారు. కాగా ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు,ఎంపీలతోపాటు మంత్రులు ,ముఖ్యమంత్రులు ,కేంద్రమంత్రులు సైతం అయ్యారని ఇక మిగిలిన పదవులైన గవర్నర్లు, విదేశీ రాయబారులుకూడ అవుతారని చెప్పారు. రానున్న కాలంలో అవి సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
సో మొత్తం మీద అటు రాజకీయంగా ఇటు పరిపాలనపరంగా సీఎం కేసీఆర్ ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ఈనేపథ్యలంలోనే ఆయన ఫెడరల్ ఫ్రంట్ సైతం ఇందులో భాగమనే ప్రచారం కూడ కొనసాగుతోంది.