జనసేనకు ప్రచారం చేస్తా, అప్పుడు బాబాయి పవన్ కళ్యాణ్ వద్దన్నారు: రామ్ చరణ్ తేజ
హైదరాబాద్: తన బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నటుడు రామ్ చరణ్ తేజ గురువారం వెల్లడించారు. తన తండ్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే తాను ప్రచారం చేద్దామని అనుకున్నానని చెప్పారు. కానీ అప్పుడు బాబాయ్ పవన్ వద్దన్నారని చెప్పారు.
ఇప్పుడు తన బాబాయి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయి అనుమతిస్తే నేను జనసేన తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా నుంచి తన జనసేన యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన గత ఆదివారం యాత్రను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు కుటుంబం కూడా అండగా ఉండేందుకు సిద్ధమయింది. గతంలోనే అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, వరుణ్ తేజ, అల్లు అర్జున్ తదితరులు మద్దతుగా ఉంటామని ప్రకటించారు.
-
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications