టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే.. ఆ మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా: శంకరమ్మ

Recommended Video

    ఆ పార్టీ టికెట్ ఇవ్వకుంటే.. మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా

    హైదరాబాద్‌: తనకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ నేత శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

    శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుంటే మంత్రిపై సూసైడ్‌ నోటు రాసుకుని ఎల్బీ నగర్‌ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని శంకరమ్మ తేల్చి చెప్పారు.

    If MLA ticket not given to me, i will suicide, says shankaramma

    హుజూర్‌నగర్‌ టికెట్‌ తనకు కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు.

    ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్‌నగర్‌ సీటును కేటాయించాలని శంకరమ్మ కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని కంటతడి పెట్టారు. పార్టీ అధిష్టానం తనకు కేటాయిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+