హైదరాబాద్ లో పట్టుపడ్డ మరో మూడు కోట్లు .. వీటికి కూడా ఏపీతో సంబందం ఉందా ?
హైదరాబాద్ : ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న రూ.2 కోట్లు పట్టుబడిన సంగతి మరవకముందే మరో 3 కోట్ల నగదు తనిఖీల్లో దొరికింది. ఈ నగదు కూడా ఏపీలో పంచేందుకు తీసుకెళ్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. బుధవారం పట్టుబడిన నగదుకు సంబంధించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజమండ్రి అభ్యర్థి రూప కోసం తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

మరో రూ.3 కోట్లు
బంజారాహిల్స్ లో రూ. 3 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జహీరాగనగర్ చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. ఓ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. నగదును బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కు తరలించారు.
వ్యాపారిదేనా ?
ఈ నగదు వ్యాపారి అనిల్ అగర్వాల్ కు సంబంధించినదిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతనిపోటు నగదు తరలిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదురోజుల్లో తొలివిడుత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భారీగా నోట్ల కట్టలు పట్టుపడుతున్నాయి. ఎన్నికల సంఘం కూడా చెక్ పోస్టులు ఏర్పాటుచేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications