సాంకేతిక లోపం: శంషాబాద్లో ఇండిగో ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్: ఏపీ స్పీకర్, ఆనం సహా 68మంది క్షేమం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఓ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం రావడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు.
సుమారు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. విమానాశ్రయం నుంచి క్లియరెన్స్ రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు పైలట్. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా కిందకు దిగారు.

కాగా, ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తోపాటు 68మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో చక్కర్లు కొట్టిన సమయంలో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.
క్షేమంగా విమానం ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మరో విమానంలో ప్రయాణికులంతా తిరుపతికి వెళ్లారు. అయితే, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం నెలకొందే అధికారులు వెల్లడించలేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications