సీఎం రేవంత్ వద్ద లీకు రాయుళ్లు - కీలక నిర్ణయం..!?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీలో మార్పులు చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ వద్ద ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బందిలో కొందరు గతంలో కేసీఆర్ వద్ద పనిచేశారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత, అధికారిక సమాచారం బయటకు తెలిసింది. పాత వారిని మార్చి కొత్త భద్రతా సిబ్బందిని నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

దీంతో, అధికారులు ఆరా తీయగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, నిఘా అధికారులు అప్రమత్తం అయ్యారు. తంలో సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్లు, సిబ్బంది ఎవరు తన దగ్గర ఉందొద్దని సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం. రేవంత్రెడ్డి ఆదేశాలు మేరకు సీఎం సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ వర్గాలు మార్చినట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇంటి వద్ద సెక్యూరిటీని ఛేంజ్ చేశారు.












Click it and Unblock the Notifications