స్నానానికి వెళ్లి ఇంటర్ విద్యార్థుల జలసమాధి
కరీంనగర్: స్నానం చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు జలసమాధి అయిన సంఘటన తెలంగాణలోని కరీంనగర్ లో జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు మానేరు జలాశయం దగ్గరకు చేరుకుని విలపిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు కరీంనగర్ లోని జ్యోతినగర్ కు చెందిన సాదుల సునంద్ (16), బీరెల్లి వరుణ్ (16) ఇంటర్ చదువుతున్నారు. బుధవారం ఉదయం వీరిద్దరు మరో ఐదు మంది స్నేహితులతో కలిసి పోలీసు శిక్షణా కేంద్రంలో హై జంప్, లాంగ్ జంప్ చేశారు.

తరువాత మానేరూ జలాశయంలో స్నానం చెయ్యడానికి వెళ్లారు. మొదట ఐదు మంది విద్యార్థులు జలాశయంలోకి దిగారు. అనంతరం వరుణ్, సునంద్ జలాశయంలోకి వెళ్లారు. ఐదు మంది ఒక వైపు వెళ్లారు.
అయితే వరుణ్, సునంద్ మరో వైపు వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో వరుణ్, సునంద్ ఇద్దరూ గల్లంతు అయ్యారు. సాటి స్నేహితులు వారిని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. స్థానికుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications