బీజేపీ నేత నివాసంలో ఐటీ దాడులు
తెలంగాణలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత అందెల శ్రీరాములు నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్ నివాసంతోపాటు శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతిమా రెడ్డి ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పోలీస్ సిబ్బంది సాయంతో వారి ఇళ్లకు చేరుకున్న ఐటీ అధికారులు.. ఆదివారం ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేత నివాసంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారాయి. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున మహేశ్వరం నుంచి శ్రీరాములు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 26 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

కాగా, భారతీయ జనతా పార్టీ నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటితో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సామంత్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. వీరి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ సోదాల్లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి స్పష్టత రాలేదు. ఐటీ అధికారులు ఏమీ వెల్లడించలేదు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందెల శ్రీరాములు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలపై పలు కోణాల్లో ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
-
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
లొట్టలేసుకుంటూ ఉస్మానియా బిస్కెట్ తింటున్నారా- జరా సోచాయించుండ్రి -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications