ఆ ఫుటేజీ ఏమైంది?: 'ముమ్మాటికీ హత్యే?' బచ్పన్ యాజమాన్యం ఎందుకు నోరు విప్పట్లేదు..
పోలీసులు, స్కూల్ యాజమాన్యం కుమ్మక్కయ్యే సీసీటివి ఫుటేజీని మాయం చేశారని వారు
హైదరాబాద్: నగరంలోని మల్కాజ్గిరి పరిధిలో ఉన్న బచ్పన్ స్కూల్లో రచిత్ అనే బాలుడు మృతి చెందిన ఘటనపై మిస్టరీ ఇంకా వీడలేదు. బాలుడు సహజంగానే సంపులో పడి మృతి చెందాడా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అందులో తోశారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఫుటేజీ ఏమైంది?:
బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి సీసీటీవి ఫుటేజీ కీలకంగా మారింది. అయితే ఈ ఫుటేజీ మాయం కావడంతో బాలుడి మృతిపై అనుమానాలను బలపరుస్తోంది. సీసీటీవి ఫుటేజీ ఎలా మాయమైందన్న ప్రశ్నకు స్కూల్ యాజమాన్యం కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.

కావాలనే తొలగించారా?
చిన్నారి మృతిలో నిజనిజాలను నిర్దారించడానికి పోలీసులు, విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్కూల్లో సోదాలు నిర్వహించి సీసీటివి ఫుటేజీని, హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే స్కూల్ యాజమాన్యం సీసీటీవి ఫుటేజీని మాయం చేసిందని నిర్దారించారు.

స్కూల్ బ్యాగ్ మిస్:
నవంబర్ 1 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు వీడియో ఫుటేజీని మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే రచిత్ స్కూల్ బ్యాగ్ మిస్ అవడంపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. సీసీటివి ఫుటేజీ మాయమవడంపై స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం పోలీసులకూ అనుమానం కలిగిస్తోంది.

ముమ్మాటికే హత్యే?
రచిత్ తల్లిదండ్రుల ఆరోపణ మరోలా ఉంది. పోలీసులు, స్కూల్ యాజమాన్యం కుమ్మక్కయ్యే సీసీటివి ఫుటేజీని మాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. రచిత్ మృతిపై వారు డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు.
కాగా, రచిత్ మృతి నేపథ్యంలో అధికారులు స్కూలుకు తాళం వేశారు. మరోవైపు ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులంతా స్కూలుకు తాళం వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 164మంది పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications