తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీ. జనసేన పోటీ చేసే 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను మంగళవవారం ప్రకటించింది.
కూకట్పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి.

ఇటీవలే ఖరారైన బీజేపీ-జనసేన పొత్తు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర నేతలు గత శనివారం రాత్రి జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్కర్నూల్, కోదాడ, కూకట్పల్లి స్థానాలు కేటాయించినట్లు సమాచారం.
అయితే, శేరిలింగంపల్లి స్థానంపై మాత్రం ఎటూతేల్చలేకపోయినట్లు తెలిసింది. ఈ స్థానం కోసం జనసేన పట్టుపడుతుండగా.. ఇప్పటికే బీజేపీ నేతలు చాలా మంది ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన అనంతరం శేరిలింగంపల్లి స్థానంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

కాగా, మొదట జనసేన 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా.. తాజా చర్చల్లో 8 స్థానాలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా బీజేపీ, జనసేన నేతలు నిర్ణయిచారు. 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మంగళవారం మరో 12 మందితో జాబితాను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications