ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని అమీర్ పేటలో ఉన్న తమ నివాసంలో నేడు తుది శ్వాస విడిచారు.ఈ విషాద వార్త కొణిజేటి రోశయ్య కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది.
మాజీ సీఎం రోశయ్య రాజకీయ ఎదుగుదలకు ఆమెనే కారణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న రోశయ్య రాజకీయ ప్రస్థానంలో ఆయన సతీమణి శివలక్ష్మి పాత్ర చాలా కీలకమైనది. రోశయ్యకు అండదండగా నిలిచి, ఆయనకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చి ప్రజాసేవలో ముందుకు వెళ్లేలా చేసిన ఘనత ఆమెది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా, కుటుంబ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చి చూసుకున్నారు. రోశయ్య అత్యున్నత పదవులను అలంకరించిన కూడా నిరాడంబరంగా జీవించారు.

రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా పని చేస్తున్న రోశయ్య సతీమణి ఏ రోజు తను సీఎం భార్యను అన్న అహంకారాన్ని చూపించలేదు. 2021లో రోశయ్య మరణానంతరం ఆమె తన కుమారులతో కలిసి అమీర్ పేట లో నివసిస్తున్నారు. శివలక్ష్మి మృతి చెందారన్న వార్త తెలియగానే అనేక రాజకీయ నేతలు వారి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
అన్ని పార్టీల నేతలు సంతాపం
పార్టీలకు అతీతంగా కొణిజేటి రోశయ్య అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉన్న కారణంగా కాంగ్రెస్,బీఆర్ఎస్, టిడిపి, బిజెపి వంటి పార్టీల నుండి సీనియర్ నేతలు ఆమెకు సంతాపం తెలిపారు. సౌమ్యురాలిగా, ఆదర్శ గృహిణిగా ఆమె కుటుంబాన్ని తీర్చిదిద్దారని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు.
తెలుగు రాష్ట్రాల సీఎం ల సంతాపం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దివంగత రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. అయినప్పటికీ వారిలో ఎవరూ రాజకీయాలలోకి రాలేదు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శివలక్ష్మి అంత్యక్రియలు జరపడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications