నిజాయితీ ఎఫెక్ట్: రాజకీయ ఒత్తిళ్లు, థానే నుంచి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ బదలీ
ముంబై: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాఫ్తును చూసిన సిబిఐ మాజీ డైరెక్టర్, ప్రస్తుత థానే సంయుక్త పోలీస్ కమిషనర్గా ఉన్న వివి లక్ష్మీనారాయణ బదలీ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అదనపు డిజిపి-అడ్మినిస్ట్రేటివ్గా పదోన్నతి కల్పించి, బదలీ చేసింది.
నిజాయతీగా విధులు నిర్వర్తిస్తూ అక్రమార్కులపై విరుచుకుపడుతున్న లక్ష్మీనారాయణ శైలి మింగుడుపడని కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే ఈ బదలీ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల థానేకు చెందిన బిల్డర్ సూరజ్ పరిమార్ ఆత్మహత్య కేసులో లక్ష్మీనారాయణ కఠినంగా వ్యవహారించారు.

దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు కార్పొరేటర్లు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ బదలీ జరిగింది. ఈ బదిలీపై సోషల్ మీడియాలోను పెద్దయెత్తున చర్చ జరిగింది. ఆయన్ను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రశ్నిస్తూ పలుచోట్ల హోర్డింగులు వెలిశాయి.
లక్ష్మీనారాయణ బదిలీకి ముఖ్యమంత్రి ఫడ్వనీస్ తొలుత ససేమీరా అన్నారని తెలుస్తోంది. అయితే, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బదలీ చేయక తప్పలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా థానేలో లక్ష్మీనారాయణ స్థానంలో అశుతోష్ దుంబ్రే అపాయింట్ అయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications