అవినీతి, అసమర్థ పాలన: బీఆర్ఎస్, కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా
ఖమ్మం: దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీనేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ 11 స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చారని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. మరో రెండేళ్లలో మనదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని జేపీ నడ్డా తెలిపారు.
తెలంగాణకు కేంద్రం పదేళ్లుగా అన్ని రకాలుగా సాయం చేసిందన్న జేపీ నడ్డడా.. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందని చెప్పారు. సికింద్రాబాద్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. మనదేశంలో తయారైన ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయన్నారు. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్ చైనా, కొరియా, జపాన్వి ఉండేవని.. ఇప్పుడు మేకిన్ ఇండియా పేరుతో ఫోన్లను భారత్లోనే తయారు చేస్తున్నామని నడ్డా వివరించారు.

దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని జేపీ నడ్డా చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని, మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స లభిస్తుందన్నారు. భవిష్యత్తులో పైపులైను ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు.
Addressed a public meeting in Kothagudem, Telangana, today.
— Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) April 29, 2024
Congress government has consistently ignored the needs of the people, prioritizing their own interests and agendas over the welfare of the people.
The enthusiasm of the people of Telangana demonstrates their support… pic.twitter.com/l1VGSolSZd
ఎస్టీల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి చేసిందని.. గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని జేపీ నడ్డా తెలిపారు. గిరిజన రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి అండగా ఉన్నాం. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. మనదేశ ఆర్థిక వ్యవస్థను మోడీ 11 నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చారు. వచ్చే రెండేళ్లలో మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. తమ పాలనలో 25 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
అయోధ్యలో రామ మందిరం
విపరీతమైన ఎండలో కూడా ప్రజలు తమ మీద ప్రేమతో తమ సభకు తరలివచ్చారని జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్రావు గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోడీ సాకారం చేశారన్నారు. తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్ను రద్దు చేసిందని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు
మరోవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నడ్డా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైనదని.. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి చేశారని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నామన్నారు. ఇండియా కూటమి ఆయా పార్టీల వారసుల కోసమేనని అన్నారు. ఇండియా కూటమిలో నేతలంతా కుంభకోణాలకు పాల్పడ్డవారేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతేనని.. వారి ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శక్తులన్నీ విజృంభిస్తాయని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్నారని తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications