తాత బాటలోనే, ఎప్పుడూ గుండెల్లోనే: జూ. ఎన్టీఆర్
ఎన్టీఆర్ మార్గాన్ని అనుసరిస్తామని సినీ హీరో ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గాన్ని అనుసరిస్తామని సినీ హీరో ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ 21 వ వర్ధంతిని పురష్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ, కళ్యాణ్రామ్, జూ.ఎన్టీఆర్, తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మనల్ని విడిచి వెళ్లిపోయి ఏళ్లు గడుస్తూనే ఉన్నాయని అన్నారు. ఏళ్లైనాకొద్దీ ఆయన లేని భావం మరింత ఎక్కువ కలుగుతూనే ఉందని అన్నారు. మహానుభావులు మనల్ని భౌతికంగా విడిచివెళ్లిపోయినా.. వారు చేసిన మంచి పనులు మన చుట్టూనే ఉంటాయని చెప్పారు.

తాతా ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలోనే ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు. మహిళలు, ప్రజల కోసం ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఆయన తమకు మంచి మార్గాన్ని చూపారని, ఆయన ఆశయాలతోనే ముందుకు సాగుతామని ఎన్టీఆర్ తెలిపారు.
హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే సమయం చాలదని అన్నారు. ఆయన మహోన్నతమైన వ్యక్తని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. దేశంలో ఎందరో మహానుభావులున్నారు కానీ, ఎన్టీఆర్కు ప్రత్యేకత ఉందని అన్నారు. ఆయన సంస్కరణల ద్వారా రాష్ట్ర దిశనే కాదు, దేశ దిశను కూడా మార్చిన మహా మనిషి అని హరికృష్ణ అన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications