కేఏ పాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అగ్నిప్రమాద ఘటనలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కాగా, సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదని.. నరబలి అని కేఏ పాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. తన కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించారు కేఏ పాల్. దేశంలో జరిగే అగ్ని ప్రమాదాలపైనా సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా? అంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని కూడా కేఏ పాల్ వాదించారు. దీంతో సంబంధం లేని వాదనలు వినిపించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆయనను మందలించినట్లు సమాచారం.
కాగా, గతంలో కూడా తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై కేఏ పాల్ విమర్శించారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications