కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వాన ప్రక్రియను ప్రారంభించింది. డిజైన్ ఏజెన్సీ లను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఈ నెల 15 లోపు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ నీటిపారుదల వెబ్ సైట్లో పొందుపరిచింది. ఇక నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రిస్టోరేషన్ డిజైన్లను చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బారాజ్ లో పిల్లర్లకు పగుళ్లు, కుంగుబాటు వచ్చిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆహ్వానం పలికింది. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనుంది.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవకతవకలను విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమగ్ర విచారణ అనంతరం ఈ కమిషన్ ప్రభుత్వానికి 600 పేజీలతో రిపోర్టును అందజేసింది. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీబీఐ కేసు విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. త్వరలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా పలువురు అధికారులను విచారించనున్నట్లు సమాచారం. దీనిపై సీబీఐ అధికారికంగా ప్రకటన చేయలేదు.
ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీని ఆయకట్టు 45 లక్షల ఎకరాలుగా ఉంది. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.
-
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications