Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పక్కరాష్ట్రం సీఎం, అంతగా !

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందగా, తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, ప్రజాతీర్పును అందరూ స్వీకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ప్రతి ఎన్నికల ఫలితాల్లో రాజకీయ పార్టీలు గుణపాఠం నేర్చుకోవాలని సిద్దరామయ్య చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి తన సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఓటమితో కుంగిపోమని, గెలుపుపై ​​గర్వపడమని, నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించిందని సిద్దరామయ్య అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మా పార్టీ వెనుకబడిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. తెలంగాణ కర్ణాటక పొరుగు రాష్ట్రం కాబట్టి అక్కడ విజయం సాధించడంలో కర్ణాటక ప్రభుత్వ హామీ పథకాలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి పెద్ద పాత్ర పోషించిందని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

Karnataka CM Siddaramaiah made sensational comments on Congress victory in Telangana

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏడాది క్రితం ఎవరూ ఊహించలేదని, రాహుల్ గాంధీ భారత్ జోడో కార్యక్రమం అక్కడి పార్టీ కార్యకర్తలను మరింతగా ప్రోత్సహించిన మాట వాస్తవమే అని, చాలా క్రమపద్ధతిలో తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరిగింది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత ఇచ్చిన ఉచిత హామీల నేరవేర్చడంతో పక్క రాష్ట్రం అయిన తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం నెలకొల్పారని సిద్దరామయ్య అన్నారు.

బీఆర్‌ఎస్‌తో బీజేపీ అంతర్గత ఒప్పందం చేసుకున్న విషయం తెలంగాణ ఓటర్లు పసిగట్టారని, ఆ రెండు పార్టీలపై విశ్వాసం కోల్పోయేలా చేసిందని, ఈ అంతర్గత ఒప్పందం వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెల్లడించడమే మా గెలుపుకు ప్రధాన కారణం అని సిద్దరామయ్య అన్నారు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయంలో డబ్బు, మత రాజకీయాల పాత్ర చాలా ఎక్కువగా ఉందని సిద్దరామయ్య ఆరోపించారు.

Karnataka CM Siddaramaiah made sensational comments on Congress victory in Telangana

ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని, దాంతో పాటు సమాజాన్ని మతం ప్రాతిపదికన విభజించే పాత గేమ్‌ను బీజేపీ మరోసారి కొనసాగించిందని సిద్దరామయ్య ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ బీజేపీ పెద్దగా డబ్బు వృధా చేయలేదని, తెలంగాణలో బీజేపీ మత రాజకీయాలకు కూడా ఆస్కారం లేదని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడానికి కూడా అప్పటి వరకు ఉన్న అధికార పార్టీ నాయకుల వ్యతిరేక కారణం అయ్యిందని సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+