అత్యాచార నిందితులను ఉపేక్షించేది లేదు: ‘కేసీఆర్ ఉగ్రరూపం’ అంటూ మంత్రి తలసాని
హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. అంతేగాక, కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
దిశకు న్యాయం జరగాలని దేశమంతా ఎదురు చూసిందని.. ఇందుకు తగ్గట్లుగానే నిందితుల ఎన్కౌంటర్తో తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పిందని మంత్రి తలసాని అన్నారు.

తెలంగాణ పోలీసుల సత్తా ఏంటో గతంలోనే నిరూపించుకున్నారని, ఇంతకుముందు ఉగ్రవాది అయిన వికారుద్దీన్ అతని గ్యాంగ్, నయీమ్ గ్యాంగ్ వంటి ఎన్నో కేసులను తెలంగాణ ప్రభుత్వం ఛేదించిందని తెలిపారు. ఇటీవల దిశ దారుణ ఘటనపై యావత్ దేశం ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం స్పందించడం లేదని పదే పదే కేసీఆర్ను విమర్శించారని, ఆయన వెళ్లి బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించలేదని దుయ్యబట్టారని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రారు.. ఆయనకు ఉగ్ర రూపం వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలుసు.. కొంత మంది ఏ అవకాశం వచ్చినా ఇలా దుమ్మెత్తిపోస్తుంటారని తలసాని మండిపడ్డారు.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కానీ, కాలం కలిసొచ్చినప్పుడు లేదా పోయే కాలం దగ్గరికొచ్చినప్పుడు ఇలాంటి ఎన్ కౌంటర్లు జరుగుతుంటాయన్నారు. ఆడపిల్లల్లో తల్లినో.. చెల్లినో.. చూసుకోవాలి.. తేడాగా ప్రవర్తిస్తే తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్లే జరుగుతాయని మంత్రి తలసాని హెచ్చరించారు. ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడే వారిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తేల్చి చెప్పారు.
వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు రీ కన్స్ట్రక్చన్ కోసం నిందితులను దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లగా.. అక్కడ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications