Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ వస్తే రైతులు అరేబియా సముద్రంలోకే: కేసీఆర్ హెచ్చరిక

హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ (KCR).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్​ఎస్​ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్​నే అని దుయ్యబట్టారు. 1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్​ ప్రభుత్వం కాల్చి చంపిందని చెప్పారు. వందల మందిని పొట్టన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు.

KCR hits out at congress party in BRS Public Meeting at Bodhan

సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్‌​ను కాంగ్రెస్​ ప్రభుత్వం ఎండగట్టలేదా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిజాం సాగర్‌​కు ఏడాది మొత్తం నిండుగా ఉంచే బాధ్యత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్​ ఇస్తున్నామని తెలిపారు. బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని సీఎం కేసీఆర్​ సూచించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్​ నేతలు అంటున్నారని మండిపడ్డారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌​కు ఓటేస్తే దళారీ రాజ్యం మళ్లీ వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళతారు అని సీఎం కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్​ దుబారా అని రేవంత్​ రెడ్డి అంటున్నారు.. మరి కాంగ్రెస్​ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్​ అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దుర్మార్గపు కాంగ్రెస్‌​ను రైతులు మట్టి కరిపించాలను ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్​కు ఓటేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆరోపించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్​లో సైతం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్​ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+