మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు!: డీజీపీ-న్యాయశాఖ అధికారులతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు అంశం మరోసారి తెరపైకి వస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడుగులు చూస్తోంటే అలాగే కనిపిస్తోందనే వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి.
కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఏసీబీ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఓటుకు నోటు కేసుపై కూడా సమీక్షించారు. ఈ కేసు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచంద్ర రావు, ఏసీబీ రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఆదివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సోమవారం పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు పురోగతిపై, అలాగే, ఫోరెన్సిక్ నివేదికపై చర్చించారని తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇవ్వజూపారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియోలు బయటపడ్డాయి. దీనిపై విచారణ జరుగుతోంది.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి











Click it and Unblock the Notifications