తిరుమలకు బయలుదేరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమలకు బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు బయల్దేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. ఆదివారం రాత్రి కొండపైన గెస్ట్ హౌస్లో కేసీఆర్ బస చేయనున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీర్ తిరుమలకు వెళ్లడం ఇది రెండోసారి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అప్పట్లో స్వామి వారికి కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు.

తిరుమల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ నెల 29న సీఎం కేసీఆర్ సతీసమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బసచేసి 30వ తేదీ ఉదయం కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరుకానున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications