Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గేర్ మార్చిన కేసీఆర్, కొత్త అస్త్రం - చివరి నిమిషంలో సీన్ మార్చేనా..!!

తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ..కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ హైదరాబాద్ లోనే మకాం వేసారు. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ గేర్ మార్చుతున్నారు. చివరి రెండు రోజుల్లో కొత్త అస్త్రాల ప్రయోగానికి సిద్దమయ్యారు. కేసీఆర్ నిర్ణయాలు కలిసి వస్తాయా..హ్యాట్రిక్ విజయం తెచ్చిపెడతాయా.

హోరా హోరీ పోరు: తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 80 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం తమదేనని బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం చెబుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాల పైన కేసీఆర్ కీలక సమీక్ష చేసారు. ప్రచారం తుది దశకు చేరటంతో నియోజవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

KCR to change Campaign strategies for last two day, likely to announce new Schemes

సర్వే నివేదికలను సమీక్షించారు. ఎక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఏ అంశాలు ప్రభావితం చూపుతున్నాయనే వాటి పైన కసరత్తు చేసిన కేసీఆర్..ఇప్పుడు చివరి రెండు రోజుల్లో తన వ్యూహం మార్చేందుకు సిద్దమయ్యారు. ఈ రెండు రోజుల ప్రచార సభల్లో కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కేసీఆర్ కొత్త వ్యూహం: కాంగ్రెస్ ప్రధానిగా సీఎం కేసీఆర్ వైఖరి...అమలు కాని హామీలు..మహిళలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు..నిరుద్యోగ యువత పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. యువత బీఆర్ఎస్ కు దూరం అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతోంది. అదే సమయంలో మహిళల మద్దతు ఎవరి వైపు ఉందనేది కేసీఆర్ ప్రత్యేకంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

ప్రతీ నియోజకవర్గంలో గ్రౌండ్ రియాల్టీని సమీక్షించిన కేసీఆర్.. పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేసారు. మరో రెండు మూడు కొత్త పథకాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ మూడు రోజుల ప్రచారంలో కేసీఆర్ వీటినే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

KCR to change Campaign strategies for last two day, likely to announce new Schemes

కీలక ప్రకటనల దిశగా: ప్రత్యేకించి యువతను ఆకట్టుకోవటంతో పాటుగా..మహిళా ఓట్ బ్యాంక్..గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే, కేసీఆర్ చివరి నిమిషంలో చేసే ఈ ప్రకటనల ద్వారా ఏ మేర ఓటర్ల పైన ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

అదే విధంగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే చేపట్టాల్సిన కార్యాచరణ పైన కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఎన్నికల వార్ నుంచి ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తోంి. దీంతో, తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ఏ ప్రకటనలు చేయబోతున్నారు...ఎలాంటి మార్పు వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+