Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ సహా టీ కాంగ్రెస్ కీలక నేతల భేటీ: 13న రాహుల్ రాక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ సహా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరిగింది. రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సుమారు గంటన్నరపాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన, పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా పరిణామాలపైనా చర్చించారు. కాగా, ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరైన విషయం తెలిసిందే.

Key T Congress leaders including Revanth meet with KC Venugopal Rahul to arrive on the 13th

ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్

ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని మహేశ్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్, కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ ఉంటుందన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించామన్నారు. ప్రజల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలకే డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వడం జరుగుతుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+