"తెలంగాణ కాశ్మీర్" అందాలు అదరహో.. ఈ సీజన్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!
సహజసిద్ధమైన అడవులకు ఆదిలాబాద్ నిలయంగా ఉంది. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తయిన కొండలు, జలపాతాలు, సెలయేర్లు.. ఇలా ప్రకృతి అందాల నడుమ ఈ జిల్లా ఉంటుంది. అందుకే ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని తెలంగాణ కాశ్మీర్ అని పిలుస్తుంటారు. ఇక జిల్లాలోని ఖండాల ప్రాంత అందాల వీక్షణ మరో అద్భుతంగా చెప్పవచ్చు. ఖండాల ప్రాంతం అందాలు కాశ్మీర్ అందాలను పోలి ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలు అటుగా వెళ్లే ప్రయాణికులను కనువిందు చేస్తున్నాయి. చూపు తిప్పుకోలేని ఈ ప్రకృతి అందాల వద్ద సెల్ఫీలు దిగుతూ ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సెలవు రోజులు, వీకెండ్స్ లో కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేందుకు ఖండాల ప్రాంతం చక్కటి ప్రాంతంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామం ఖండాల. ఈ ప్రాంతం మొత్తం పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, ఉప్పొంగే జలపాతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా, మొలాల్ గుట్ట జలపాతం ఖండాల గ్రామానికి సమీపంలో ఉంటుంది. దట్టమైన పచ్చని అడవులు, గుట్టలు, జలపాతాలు ఈ ప్రాంతానికి అద్భుతమైన అందాన్ని ఇస్తాయి. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కాశ్మీర్ ప్రాంతాన్ని తలపించేలా కనువిందు చేస్తున్న ప్రకృతి సౌందర్యం ఖండాల సొంతం.

ఈ ప్రకృతి అందాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి 25 నుండి 30 కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. దారి పొడవునా వంపులు తిరుగుతూ కొండల మీద నుండి వెళ్లే నల్లటి తారు రోడ్డు.. ఎటు చూసినా మైమరిపించే ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. మేఘాలు, పొగమంచు ఈ గిరిజన గూడేలను తాకుతూ వెళ్లే దృశ్యాలను చూస్తే తెలియని అనుభూతికి లోనవుతారు. ఈ ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూడాలంటే తెల్లవారుజామునే ఖండాలకు చేరుకుంటే ఆస్వాదించవచ్చు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతం విషయానికి వస్తే.. ఇక్కడ గుట్టల్లో ఉన్న రెండు మూడు జలపాతాలు కలిసి ఖండాల జలపాతంగా చెబుతారు. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తే ఎవరికైనా అక్కడే ఉండిపోవాలని అనిపించడం సహజం. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కాశ్మీర్ మాదిరి వాతావరణం ఉంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని చూసేందుకు టూరిస్టులు అధికంగా వస్తుంటారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఈ అటవీ ప్రాంతాలన్నీ సందర్శకులతో కళకళలాడుతుంటాయి. ఇక ఈ ప్రాంతంలో ఖండాల వాటర్ ఫాల్స్ తో పాటు ఇచ్చోడ మండలంలోని గుండి వాగుపై సుమారు 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న గాయత్రీ జలపాతం మరో ఆకర్షణగా ఉంటుంది. ఖండాల అటవీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్లు ఉండగా కోసాయి 28 కిలోమీటర్లు, గాయత్రి జలపాతం, కుంటాల జలపాతం నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications