KTR ఓపెన్ ఛాలెంజ్: "రేవంత్.. మా ఆస్తులన్నీ తీసుకో"

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆస్తుల ఆరోపణల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి ఏకంగా రూ. లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినూత్న రీతిలో ఎదురుదాడికి దిగారు. ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరైన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, సీఎం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నేరుగా ఒక బహిరంగ సవాల్ విసిరారు.

రూ. 99 వేల కోట్లతో హామీలు నెరవేర్చుకోండి!

"మా కుటుంబానికి రూ. లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. నేను ఆయనకో మంచి ఆఫర్ ఇస్తున్నా.. రూ. లక్ష కోట్లు వద్దు, కేవలం రూ. 1,000 కోట్లు మాకు ఇచ్చి మా కుటుంబ ఆస్తులన్నింటినీ ఆయనే సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలే రూ. 99 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన రైతు భరోసా, రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు రూ. 2,500 మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలను నెరవేర్చుకోవచ్చు" అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. ఆ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే తమ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

KTR Challenges Telangana CM Revanth Reddy Take All Our Family Assets for Rs 1000 Crore Offer
KCR ఫామ్‌హౌస్‌పై సీఎం సంచలన ఆదేశాలు! 22ఏ సమస్యలపై త్వరలోనే కొత్త పాలసీ..
KCR ఫామ్‌హౌస్‌పై సీఎం సంచలన ఆదేశాలు! 22ఏ సమస్యలపై త్వరలోనే కొత్త పాలసీ..

ఫార్ములా-ఈ రేసు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్!

ఫార్ములా-ఈ రేసు కేసుపై స్పందిస్తూ, హైదరాబాద్ నగరాన్ని ఎలక్ట్రిక్ వాహన రంగానికి (EV Hub) ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చాలనే మంచి ఉద్దేశంతోనే ఆనాడు ఈ పోటీలను ఏర్పాటు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోటార్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడానికి లండన్ వరకు వెళ్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్షసాధింపుతో హైదరాబాద్‌కు వచ్చిన అంతర్జాతీయ ఈవెంట్‌ను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సహకరిస్తామని, చివరికి న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ అడ్డంగా దొరికారు - ఇవిగో ఆధారాలు..!
కేసీఆర్ అడ్డంగా దొరికారు - ఇవిగో ఆధారాలు..!

కోర్టు విచారణ వాయిదా!

హెచ్‌ఎండిఏ (HMDA) నిధుల బదిలీలో నిబంధనలు పాటించలేదంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్‌తో పాటు అప్పటి ప్రభుత్వ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి తదితరులు శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. పాలనను పక్కనబెట్టి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+