అమెరికాలో జాహ్నవి మృతి కేసు ముగింపు విచారకరమన్న కేటీఆర్
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jahnavi Kandula) మృతి కేసును నీరుగార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. జాహ్నవి మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు చెప్పడంతో అమెరికా కోర్టు నిందితుడ్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు శిక్ష పడకపోవడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ అంశంపై అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

అంతేగాక, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి.. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ కోరారు. ఉన్నత లక్ష్యాలతో అమెరికాకు వెళ్లిన జాహ్నవి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమైతే.. ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Disgraceful & absolutely unacceptable !
— KTR (@KTRBRS) February 22, 2024
I demand the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula
I request EA Minister @DrSJaishankar Ji to take up the matter with his counterpart & demand a… https://t.co/90pw59LtCo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) 2023 జనవరిలో సియాటెల్లో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ.. పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. 'ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు' అన్నట్లు ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. అయితే, ఈ కేసులో విచారణ మాత్రం నిందితుడికి శిక్షపడేలా జరగకపోవడం గమనార్హం.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications