కేసీఆర్! జగన్కు మద్దతుకాదు.. ఇలా చెయ్: మళ్లీ సర్వే చేస్తున్న లగడపాటి, తెలంగాణలో కూడా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు తారుమారయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకున్న లగడపాటి.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో.. ఇక నుంచి తమ సర్వే వివరాలను ఎన్నికలు పూర్తయ్యాక చెబుతానని ప్రకటించారు. ఇదే విషయాన్ని తాజాగా మంగళవారం మరోసారి చెప్పారు.

టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయాలి
ఏపీలో ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తుందని, హంగ్ వచ్చే పరిస్థితి లేదని, ఎవరితో అభివృద్ధి జరుగుతుందో ప్రజలు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పేటీ చేస్తే సంతోషమని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి భావసారూప్యత కలిగిన పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే బాగుంటుందన్నారు.

గిఫ్ట్ ఇస్తానంటే ఇలా చేయాలి
చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారని, అలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటే నేరుగా పోటీ చేయడమో, ఎవరితోనైనా కలిసి పోటీ చేయడమో ఉండాలని, తెరాస ఏపీకి వచ్చే పోటీ చేస్తే సంతోషిస్తానని, దాని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుందని, ప్రజల మధ్య విభేదాలు తొలగిపోతాయని, అలా కాకుండా ఎవరికో సహకరించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెరాస.. జగన్ నేతృత్వంలోని వైసీపీకి మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో లగడపాటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎవరికో మద్దతివ్వడం సరికాదని, మద్దతిచ్చిన వారు గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా ఉంటుందని, ఇలాంటివి ఉండకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాల్లో పోటీ చేయాలన్నారు.

సర్వే వివరాలు ఆ తర్వాతే ప్రకటిస్తా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తాను చేపట్టే సర్వేలకు సంబంధించిన వివరాలను ఎన్నికల తర్వాతే ప్రకటిస్తానని లగడపాటి చెప్పారు. తెలంగాణ, ఏపీ పోలింగ్ పైన కూడా సర్వే చేస్తానని అన్నారు. గత అనుభవం దృష్ట్యా ఈ సర్వే ఫలితాలను మాత్రం ఎన్నికల తర్వాత ప్రకటిస్తారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications