lockdown: లవ్ మ్యారేజ్, విదేశాల్లో ఉద్యోగం, డబ్బులు లేక కాటేజ్ లో టెక్కీలు ఆత్మహత్య, రీచార్జ్ !
హైదరాబాద్/ చెన్నై/ కోడైకెనాల్: సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణకు చెందిన యువతి, యువకుడు ఒకరిని ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలో కాటేజ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కరోనా దెబ్బతో దాచుకున్న డబ్బులు ఖాళీ కావడం, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినా వెళ్లడానికి డబ్బులు లేకపోవడం, సహాయం చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం, సొంత ఊర్లకు వెళ్లడానికి లాక్ డౌన్ అడ్డు కావడం, కనీసం మొబైల్ కరెన్సీ రీచార్జ్ చెయ్యడానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన టెక్కీలు ఆత్మహత్య చేసుకున్నారు.

తెలంగాణ అమ్మాయి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోజెట్ల గోపికృఫ్ణన్ (25), నందిని (25) అనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. గోపికృఫ్ణన్, నందిని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గోపికృఫ్ణన్, నందిని గత ఏడాది పెళ్లి చేసుకుని తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కోడైకెనాల్ లోని అట్టువంపట్టి ప్రాంతంలో కాటేజ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

విదేశాల్లో నందినికి ఉద్యోగం ఓకే
కరోనా వైరస్ దెబ్బతో గత మార్చి నెల నుంచి గోపికృఫ్ణన్, నందిని ఉద్యోగాలకు వెళ్లకుండా కాటేజ్ కే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో గోపికృఫ్ణన్, నందిని దంపతులు విదేశాల్లో ఉద్యోగాలు సంపాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నందినికి ఇటీవల ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం వచ్చింది.

లాక్ డౌన్ దెబ్బకు ఆర్థిక సమస్యలు
ప్రస్తుతం పని చేస్తున్న చోట గోపికృఫ్ణన్, నందిని ఉద్యోగాలు నిలిపివేశారని తెలిసింది. లాక్ డౌన్ కారణంగా గోపికృఫ్ణన్, నందిని దంపతులు దాచుకున్న డబ్బులు ఖాళీ అయిపోయాయి. కొంతకాలం నుంచి గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆర్థిక సమస్యలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది. కాటేజ్ కే పరిమితం అయిన గోపికృఫ్ణన్, నందిని చుట్టుపక్కల వాళ్లతో అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నారు.

డిప్రెషన్ లో దంపతులు
కొడైకెనాల్ సొంత ఊరు కాకపోవడంతో ఆర్థిక సహాయం చెయ్యాలని గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఎవ్వరినీ అప్పు అడగలేకపోయారు. ఇదే సమయంలో నందిని ఆస్ట్రేలియా వెళ్లడానికి డబ్బులు అవసరం అయ్యింది. లాక్ డౌన్ కారణంగా గోపికృఫ్ణన్, నందిని తెలంగాణకు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాలపై గోపికృఫ్ణన్, నందిని దంపతులు తీవ్ర డిప్రెషన్ లకు లోనై సతమతం అయ్యారు.

రెండు రోజుల బయటకు రాకపోవడంతో !
గత రెండు రోజుల నుంచి గోపికృఫ్ణన్, నందిని దంపతులు కాటేజ్ నుంచి బయటకురాలేదు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి గోపికృఫ్ణన్, నందిని దంపతులు కాటేజ్ నుంచి ఎందుకు బయటకురావడం లేదు అనే అనుమానంతో వెళ్లి తలుపులు తట్టారు. గోపికృఫ్ణన్, నందిని దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాటేజ్ తలుపులు పగలగొట్టి చూడగా గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

రెండు మాటలతో డెత్ నోట్
గోపికృఫ్ణన్, నందిని మొబైల్ ఫోన్లలో కరెన్సీ పూర్తిగా ఖాళీ అయ్యిందని పోలీసులు గుర్తించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడం, విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వలనే ఆత్మహత్య చేసుకుంటున్నామని రెండు మాటలు మాత్రమే డెత్ నోట్ రాసి పెట్టి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు. విదేశాలకు వెళ్లడానికి అవకాశం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని కోడైకెనాల్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications