వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో కేంద్రం స్పష్టత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందని కేంద్రమత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆ రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరిందని చెప్పారు.

 Lok Sabha: Centre clarifies on Tribal reservations in Telangana

రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు.

English summary
Lok Sabha: Centre clarifies on Tribal reservations in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X