Lok Sabha: బీజేపీ రెండో జాబితా విడుదల, తెలంగాణ నుంచి డీకే అరుణ సహా పోటీలో వీరే
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ 72 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటి వరకు మొత్తం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్లో పెట్టింది.
తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులు విషయానికొస్తే.. ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి శానంపూడి సైది రెడ్డి, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణను అభ్యర్థులుగా ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. కాగా, సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

ఇక, జాతీయ స్థాయిలో పలువురు కీలక నేతలకు రెండో జాబితాలో అవకాశం లభించింది. ప్రముఖ అభ్యర్థులలో హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కర్నాల్ నుంచి హర్యానా తాజా మాజీ ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషి, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య, హవేరీ నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి టికెట్ లభించింది.
Union Minister Anurag Thakur to contest from Himachal Pradesh's Hamirpur, former Karnataka CM Basavaraj Bommai to contest from Haveri, BJP MP Tejasvi Surya to contest from Bangalore South, Union Minister Nitin Gadkari to contest from Nagpur, Union Minister Piyush Goyal to contest… https://t.co/FMsQL4yX1M
— ANI (@ANI) March 13, 2024
రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కగా.. దాద్రానగర్ హవేలీ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఏడుగురు, హర్యానా నుంచి ఆరుగురు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి ఐదుగురు, మహారాష్ట్రం నుంచి 20 మంది, త్రిపుర నుంచి ఒకరు, ఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు ఉన్నారు.
మార్చి నెల ప్రారంభంలో బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా 72 మంది అభ్యర్థులతో పాటు, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ముందే బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు 267 మంది అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications