వోల్వో బస్సు, లారీ ఢీ... రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
హైదరాబాద్: కట్టంగూర్ వద్ద శుక్రవారం ఉదయం వోల్వో బస్సు, లారీ ఢీ కొన్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డాడు.
తెల్లవారుజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రహదారి కనిపించక పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రైస్ మిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైస్ మిల్లులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రైస్ మిల్లు సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహ ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో మిల్లులోని ధాన్యం, బ్యాగులు మంటల్లో తగలబడ్డాయి. సుమారు రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications