రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య(ఫొటోలు)
ఖమ్మం: తల్లిదండ్రులు మందలించారని వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట ఖమ్మం నగరంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం జరిగింది. వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసిఈ చదువుతున్న హిరణ్మయి(19), సాయికృష్ణ(19) ప్రేమించుకున్నారు.

వీరిద్దరూ మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఖమ్మం చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్కు చేరుకుని, తమ బ్యాగ్లను ప్లాట్ఫారం పైనే పడవేసి, రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు.

అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే వీరి మరణానికి కారణమని సమాచారం. వారి బ్యాగుల్లో ఉన్న ఐడెంటిటీ కార్డుల సాయంతో మృతులను గుర్తించగలిగారు. కాగా, మృతులిద్దరూ హన్మకొండలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు. హిరణ్మయి, సాయికృష్ణల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications