వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తల్లిదండ్రులు మందలించారని వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట ఖమ్మం నగరంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం జరిగింది. వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసిఈ చదువుతున్న హిరణ్మయి(19), సాయికృష్ణ(19) ప్రేమించుకున్నారు.

 A love couple committed suicide

వీరిద్దరూ మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఖమ్మం చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుని, తమ బ్యాగ్‌లను ప్లాట్‌ఫారం పైనే పడవేసి, రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు.

 A love couple committed suicide

అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే వీరి మరణానికి కారణమని సమాచారం. వారి బ్యాగుల్లో ఉన్న ఐడెంటిటీ కార్డుల సాయంతో మృతులను గుర్తించగలిగారు. కాగా, మృతులిద్దరూ హన్మకొండలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు. హిరణ్మయి, సాయికృష్ణల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

English summary
A love couple committed suicide in Khammam district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X