పబ్లో తప్ప తాగి, గర్ల్ ఫ్రెండ్స్తో తూలుతూ కారుతో ఢీకొట్టి చంపేశాడు
చదివేది ఎెంటెక్. మందు, మగువలకు బానిసై పబ్లో తప్ప తాగి తన కారుతో ఆ వ్యక్తిని ఢీకొట్టి చంపేశాడు. చివరకు పోలీసులు చేతికి చిక్కాడు.
హైదరాబాద్: మందు, మగువకు బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాడు పడిన ఓ ఎంటెక్ విద్యార్థి చివరకు కటకటాల పాలయ్యాడు. పబ్ల్లో పీకల దాకా తాగి గర్ల్ ఫ్రెండ్స్తో జల్సా చేయడం అతనికి అలవాటు ఓ రోజు ఎప్పటిలాగే పీకల దాకా తాగి గర్ల్ఫ్రెండ్ను దించడానికి హైదరాబాద్లోని గచ్చిబౌలి వెళ్లాడు.
తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతున్న మాజీ సైనికోద్యోగి దేవదానం(72)ను వేగంగా వచ్చి కారుతో ఢీకొట్టాడు. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. నిరుడు డిసెంబర్ 10వ తేదీ తెల్లవారు జామున రాయదుర్గం, మాతా టెంపుల్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సికింద్రాబాద్, బాపూఘాట్కు చెందిన నిందితుడు గుత్తికొండ ప్రశాంతకుమార్ను సోమవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూలో ప్రశాంతకుమార్ ఎంటెక్ చదువుతున్నాడు. నిత్యం పబ్లలో స్నేహితులతో గడిపేవాడు. నిరుడు డిసెంబర్ 9వ తేదీ రాత్రి స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని తల్లితో చెప్పాడు. ఫోర్డ్ కారు(ఎపి10బిసి6768)లో గర్ల్ఫ్రెండ్స్ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్తో జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో ఎంజాయ్ చేశాడు.
అర్ధరాత్రి 2 గంటలకు గచ్చిబౌలిలో ఐఎస్బీ రోడ్డులోని హిల్వ్యూ అపార్టుమెంట్లో నివసించే గర్ల్ఫ్రెండ్ను దింప టానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి త్వరగా చేరుకోవాలని వేగంగా వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్ వేగంగా వెళ్తూ రాయదుర్గం, మాతా టెంపుల్ వద్ద దేవదానంను ఢీకొట్టాడు. కారును ఆపకుండా వెళ్లిపోయాడు.
సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించిన రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి చర్లపల్లి జైలుకుతరలించారు. కారు బంపర్ డ్యామేజ్ కావడంతో డివైడర్ను ఢీకొట్టానని తండ్రికి అబద్ధం చెప్పాడు. రిపేరు కోసం బోయిన్పల్లిలోని ఓ వర్క్షాపుకు డిసెంబర్ 17వ తేదీన తీసుకెళ్లాడు. ఇన్సూరెన్స్కు కూడా దరఖాస్తు చేశారు.