Maha Shivaratri: శివభక్తులకు శుభవార్త.. శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Maha Shivaratri: మహాశివరాత్రి కోసం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు సిద్ధం అవుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Maha Shivaratri RTC to Operate Special Buses for Devotees to Shiva Temples

మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేయాలన్నారు. బస్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్పలు పాల్గొన్నారు.

Maha Shivaratri RTC to Operate Special Buses for Devotees to Shiva Temples

వేములవాడకు 780 ప్రత్యేక బస్సులు
ఇప్పటికే వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మహాశివరాత్రి జాతరకు వేములవాడకు వచ్చే భక్తుల కోసం 780 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మహాశివరాత్రి జాతర జరగనుంది. ప్రత్యేక చార్జీలు వసూలు లేకుండానే హైదరాబాద్ వరంగల్ కరీంనగర్, కామారెడ్డి కోరుట్ల, మెట్ పల్లి జగిత్యాలతోపాటు పలు ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు లను నడిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.గత ఏడాది శివరాత్రి వేళ 680 ప్రత్యేక బస్సులు నడిపారు. కాగా, ఈ ఏడాది మరో వంద బస్సు సర్వీసును అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. మహాశివరాత్రి మూడు రోజుల జాతర కోసం దాదాపు లక్ష మంది భక్తులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో, ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిప్పాపూర్, జగిత్యాల బస్టాండ్ నుండి ప్రత్యేకంగా బస్సులు నడవనున్నాయి. తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయానికి ఫిబ్రవరి 25, 26, 26 తేదీల్లో 14 బస్సులు ఉచితంగా ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+