సర్వే ఎఫెక్ట్: టిఆర్ఎస్కు ఇలా చెక్, కెసిఆర్కు దెబ్బేనా?
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ను నిలువరించేందుకు అన్ని అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే వ్యూహ రచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు విపక్షాలతో మహకూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు విపక్షాలతో సంప్రదింపులను ప్రారంభించారు.
2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలంటే విపక్షాలన్నీ మూకుమ్మడిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. విపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల టిఆర్ఎస్ కు ప్రయోజనం కలుగుతోందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
టిఆర్ఎస్ను దెబ్బకొట్టాలంటే విపక్షాలు మూకుమ్మడిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అవలంభించిన పద్దతులను అనుసరిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు.

మహకూటమిపై కాంగ్రెస్ ప్రయత్నాలు
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రైవేట్ సర్వే సంస్థలతో నిర్వహించిన సర్వేలో ఫలితాల ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకుగాను కూటమిని ఏర్పాటు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే పుంజుకొనే అవకాశాలున్నాయని తేలింది. టిఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ కూటమిగా పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పొత్తుపై పార్టీల అభిప్రాయాలివే
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై సిపిఐ నేతలు సానుకూలంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. సిపిఐ నేతలతో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయమై చర్చించారని సమాచారం. అయితే సుమారు 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ నేతలు కోరుతున్నారని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిపిఐ నేతలు సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడ లేకపోలేదని కాంగ్రెస్ వర్గాల్లో అభిప్రాయం నెలకొంది. బహుజన లెఫ్ట్ఫ్రంట్ ఏర్పాటు చేసిన సిపిఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశాలు కన్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసేందుకు టిడిపి నేతలు కూడ కొందరు సానుకూల సంకేతాలను పంపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయమై మాట్లాడుదామని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు టిడిపి నేతలకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు.

బిజెపిని కూటమిలో కలుపుకొంటారా
దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. కానీ, తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యలో బిజెపిని కూడ కూటమిలో కలుపుకొంటే ప్రయోజనం ఉండే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ సాగుతోంది. అయితే ఇదే జరిగితే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే చర్చ కూడ ఉంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

కోదండరామ్తో కాంగ్రెస్ చర్చలు
వచ్చే ఎన్నికల్లో కోదండరామ్ను కూడ కలుపుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కోదండరామ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి కోదండరామ్ పార్టీని ఏర్పాటు చేస్తే ఆ పార్టీతో సర్ధుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారనే ప్రచారం కూడ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications