ప్రపంచ కుబేరుడితో మహేష్ బాబు: అమెరికాలో..భార్య నమ్రతతో కలిసి ఆయన ఇంటికి
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట హిట్ను ఎంజాయ్ చేస్తోన్నారు. కుటుంబంతో కలిసి ఆయన అమెరికా ట్రిప్కు వెళ్లారు. భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితారతో కలిసి ఇటీవలే అమెరికా వెళ్లారు. ఈ వెకేషన్కు సంబంధించిన కొన్ని ఫొటోలను మహేష్ బాబు ఇదివరకే తన అభిమానుల కోసం షేర్ చేశారు కూడా. ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద దిగిన కొన్ని ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బిల్ గేట్స్తో
ఇప్పుడు తాజాగా మహేష్ బాబు- ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ను కలుసుకున్నారు. వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన బిల్ గేట్స్ ఇంటికి భార్య నమ్రత శిరోద్కర్తో కలిసి వెళ్లారు. ఆయనను కలిశారు. కొద్దిసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్లల్లో కొద్దిసేపటి కిందటే పోస్ట్ చేశారు. బిల్ గేట్స్ గొప్పతనాన్ని వివరిస్తూ కామెంట్స్ జత చేశారు.
స్ఫూర్తిదాయకుడు..
బిల్ గేట్స్ను కలుసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారాయన. ఇప్పటివరకు తాను చూసిన, ప్రపంచంలో ఉన్న అతి గొప్ప దార్శనికుల్లో బిల్ గేట్స్ ఒకరని పేర్కొన్నారు. అందరూ గౌరవించదగ్గ వ్యక్తిగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకుడంటూ మహేష్ బాబు అన్నారు. కాగా- సర్కారువారి పాట తరువాత.. తన కొత్త సినిమా కోసం సిద్ధమౌతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సెట్స్పై ఉందీ మూవీ.
ఎస్ఎస్ఎంబీ 28తో..
ఇది మహేష్ బాబు కేరీర్లో 28వ సినిమా. యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రీకరణ జరుపుకొంటోంది. పూజా హెగ్డే హీరోయిన్. మరో కీలక పాత్రలో సంయుక్త మీనన్ నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురములో చిత్రాలను నిర్మించిందే ఈ బ్యానరే.
ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్..
ఈ మూవీ తరువాత మహేష్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కవచ్చనే ప్రచారం ఉంది. హాలీవుడ్లో ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా మొత్తాన్నీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో చిత్రీకరిస్తారనేది ఫిల్మ్నగర్ టాక్. ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ డాక్టర్ కేఎల్ నారాయణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.